ఆయన కళ్లు సజీవం
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:09 AM
టెక్కలి మేజర్ పంచాయతీ మెట్టవీధికి చెందిన చిలుకు కన్నయ్య (79) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ మెట్టవీధికి చెందిన చిలుకు కన్నయ్య (79) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ప్రజాచైతన్య కళాసమితి సభ్యుల చొరవతో శనివారం శ్రీకాకుళం రెడ్క్రాస్ సొసైటీకి సమా చారం అందిం చారు. టెక్నీషియన్లు టి.సుజాత, కె.పవన్ వచ్చిన కార్నియాలను సేకరిం చారు. ఈ సందర్భంగా కన్నయ్య భార్య నూకరత్నంను ప్రజా చైతన్య కళాసమితి సభ్యులు డీఏ స్టాలిన్, చిలుకు కృష్ణారావు, చిట్టెన్న, రమేష్ కుమార్, గణపతిరావు, పద్మనాభం తదితరులు అభినందించారు.