కాంగ్రెస్ గూటికి కృపారాణి
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:24 AM
కేంద్ర మాజీమంత్రి, వైసీపీ పూర్వపు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు.
- నేడు బద్వేల్లో షర్మిల సమక్షంలో చేరిక
టెక్కలి, ఏప్రిల్ 4: కేంద్ర మాజీమంత్రి, వైసీపీ పూర్వపు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదంటూ బుధవారం ఆమె వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరనున్నారు. బద్వేల్లో షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం కృపారాణి బద్వేల్ బయలుదేరారు. టెక్కలి అసెంబ్లీ బరి నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుపున ఆమె పోటీచేసే అవకాశాలున్నాయి.