పొరపాట్లు పునరావృతం కారాదు: ఎస్పీ
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:50 PM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ జీఆర్ రాధిక కోరారు.
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ జీఆర్ రాధిక కోరారు. బుధవారం ఈనెల 16న జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి క్యూలైన్ల ఏర్పాటు, ప్రత్యేక, వీఐపీ దర్శనం, వాహనాల పార్కింగ్ తదితర విషయాలను పోలీసు అధికారులతో అరసవల్లిలో పరిశీలిం చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మతో ఏర్పాట్లపై చర్చించారు. గత ఏడాది దర్శనాల క్యూలైన్లలో ఏయే పాయింట్ల వద్ద భక్తులు ఇబ్బం దులు ఎదుర్కొన్నారో వాటిని పరిశీలించారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చే వేలాదిమంది భక్తులకు స్వామి దర్శనం సజావుగా జరిగేలా దర్శనం కల్పించా లని కోరారు. కార్యక్రమంలో ఏఎస్సీ ప్రేమ్కాజల్, డీఎస్సీ శృతి, సీఐ ఎల్.సన్యాసి నాయుడు, ట్రాఫిక్ సీఐ అవతారం, ఎస్ఐ బలివాడ గణేష్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బీఎస్ చక్రవర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.