చోరీ కేసులో ఒకరికి జైలు
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:29 AM
బంగారం చోరీ కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్టు ఎస్ఐ వై.మధుసూధనరావు తెలిపారు.
జి.సిగడాం: బంగారం చోరీ కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్టు ఎస్ఐ వై.మధుసూధనరావు తెలిపారు. పెంట గ్రామంలో 2021లో బంగారం చోరీకి పాల్పడిన కాకర్ల కృష్ణకు పొందూరు కోర్టు న్యాయాధికారి బి.జోత్స్న విచారణ చేపట్టి ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరీమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. పెంట గ్రామానికి చెందిన మక్క యశోధ ఇచ్చిన ిఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఎంఏ అహ్మద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారు.