గుండెపోటుతో పీఏసీఎస్ అకౌంటెంట్ మృతి
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:22 AM
ఇచ్ఛాపురం పీఏసీఎస్లో అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ గౌడో గురువారం ఉదయం గుండెపోటుతో మరణించాడు.
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పీఏసీఎస్లో అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ గౌడో గురువారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండి సకాలంలో పనులు పూర్తి చేసేవాడని కార్యాలయ సిబ్బంది వాపోయారు. మంచి మిత్రుడని కోల్పోయామని సిబ్బంది, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర అన్నారు. ఈ సంద ర్భం గా మృతిడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతునికి భార్య, ఒక పాప ఉన్నారు.