Share News

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , Publish Date - May 03 , 2024 | 11:20 PM

ఎన్నికల ఉద్యోగు లకు సంబంధించి శనివారం నుంచి ఈ నెల 7 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించనున్నారు.

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

- ఈవీఎంల ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, మే 3: ఎన్నికల ఉద్యోగు లకు సంబంధించి శనివారం నుంచి ఈ నెల 7 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకా కుళం ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ సందర్శించారు. పోస్టల్‌బ్యాలెట్‌ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆదేశించారు. ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కమిషనింగ్‌ ప్రక్రియ తరువాత రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, ఈవీఎంల పనితీరుపై వారికి పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘ వేంద్ర మీనా, డీఆర్వో రంగయ్య, బివి.రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:20 PM