పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించండి
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:40 PM
ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని సబ్ కలెక్టర్, టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్ బీఎల్వోలకు ఆదేశించారు.
టెక్కలి: ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని సబ్ కలెక్టర్, టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్ బీఎల్వోలకు ఆదేశించారు. ఆదివారం సొర్లిగాం, లింగాలవలస, పోలవరం, రాధావల్లభాపురం, తేలినీలా పురం, వేములవాడ తదితర పోలింగ్ కేంద్రాలను ఏఆర్వో మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు ఎంతమంది, బెడ్రిడెన్ ఎంతమంది తదితర వివరాలను ఆరా తీశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద షామియానా, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ర్యాంప్లు ఉండాలని సూచించారు.