Share News

కబేళాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:13 AM

స్థానిక జాతీయ రహదారిపై కబేళాలకు తరలిస్తున్న 12 పశువులను శనివారం పట్టుకున్నట్టు ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు.

కబేళాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత

కంచిలి: స్థానిక జాతీయ రహదారిపై కబేళాలకు తరలిస్తున్న 12 పశువులను శనివారం పట్టుకున్నట్టు ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు. పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. అలాగే జెన్నాఘయి సమీపంలో కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మరో 32 పశువులను శుక్రవారం రాత్రి పట్టుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. పశువులన్నింటినీ కొత్తవలస గోశాలకు తరలించనున్నట్టు తెలిపారు.

కేశవరావుపేట వద్ద 23..

ఎచ్చెర్ల: కేశవరావుపేట జంక్షన్‌ వద్ద అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తున్న 23 పశు వులను పట్టుకున్నట్టు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు. నరసన్నపేట నుంచి కొత్తవలస తరలిస్తున్నట్టు విచారణ తేలిందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 12:13 AM