వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:31 PM
గ్రామాల్లో వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జోనల్ మలేరియా అధికారి శాంతిప్రభ సూచించారు. లక్ష్మీనర్సుపేట పీహెచ్సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు.
ఎల్.ఎన్.పేట: గ్రామాల్లో వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జోనల్ మలేరియా అధికారి శాంతిప్రభ సూచించారు. లక్ష్మీనర్సుపేట పీహెచ్సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ ఏడాది మలేరియా పాజిటివ్ కేసు లు, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరిం చాలన్నారు. ఆమెతోపాటు డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ శ్రీకాంత్, వైద్యాధికారి ప్రియాంక, సబ్ యూనిట్ అధికారులు ఆచారి, సూర్యం తదితరులు పాల్గొన్నారు.