Share News

రైల్వే అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో శ్రామిక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:27 PM

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఖుర్ధారోడ్‌ డివిజన్‌లో అర్బన్‌ బ్యాంకుకు ఆఫీస్‌ బ్యారర్ల ఎన్నికల్లో శ్రామిక్‌ కాంగ్రెస్‌ అభ్య ర్థులు విజయం సాధించారు.

రైల్వే అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో శ్రామిక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం

పలాస: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఖుర్ధారోడ్‌ డివిజన్‌లో అర్బన్‌ బ్యాంకుకు ఆఫీస్‌ బ్యారర్ల ఎన్నికల్లో శ్రామిక్‌ కాంగ్రెస్‌ అభ్య ర్థులు విజయం సాధించారు. మూడు విభాగాల్లో వారి అభ్య ర్థులు గెలుపొందడం విశేషం. 24, 25 తేదీల్లో పలాస రైల్వే స్టేషన్‌లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇంజనీరింగ్‌ డిపార్టు మెం ట్‌ నుంచి ఎల్‌.మోహనరావు, మెకానిక్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎంఎస్‌.ప్రసాద్‌, ఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి డి.శ్యామ సుందరరావు ఎంపికయ్యారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల ను అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉద్యోగులను శ్రామిక్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.రాజశేఖర్‌, వి.రామారావు, కె.హరిప్రసాద్‌, డి.రవి చౌదరి అభినందించారు.

విశాఖ డివిజన్‌ నుంచి చిరంజీవి..

పాతపట్నం: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే విశాఖ డివిజన్‌ అర్బన్‌ బ్యాంక్‌ డెలిగేట్‌ ఎన్నికల్లో శ్రామిక యూనియన్‌ అభ్యర్థి కొల్ల చిరంజీవి విజయం సాధించారు. నౌపడ నుంచి గుణుపూర్‌ పరిధిలో పీడబ్ల్యూఐలు, గేట్‌కీపర్లు, ట్రాక్‌మన్‌, క్లర్క్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం ఎడాన్‌ బీవీఎస్‌ మూర్తి ఎన్నిక ధ్రువపత్రాన్ని చిరంజీవికి అంద జేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని పలువురు రైల్వే ఉద్యోగులు అభినందించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:27 PM