Share News

Chandrababu- Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

ABN , Publish Date - Feb 18 , 2024 | 12:17 PM

మాజీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు సీబీఎన్‌కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.

Chandrababu- Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు సీబీఎన్‌కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.

‘‘ నా దారిద్ర్యానికి కేశినేని నాని వచ్చాడు. నన్ను పశ్చిమ నియోజకవర్గ నుంచి తీసేసి వేరే వాళ్లని పెట్టాలని కోరాడు. చంద్రబాబు నన్ను విజయవాడ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. 6 ఏళ్లు పని చేశాను. మూడు జిల్లాలకు ఇంచార్జిగా చంద్రబాబు నన్ను నియమించారు. చంద్రబాబుపై దాడి జరిగితే ఎవడూ మాట్లాడలేదు. నేను పోరాటం చేశాను. జోగి రమే‌శ్‌పై గొడవకు వెళ్లనప్పుడు సొమ్ము సిల్లి పడిపోయాను. పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలో చంద్రబాబుకి, లోకేశ్‌కి చెప్పాను. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చోవాలని కోరుతు‌న్నాను. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. విదేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి’’

‘‘చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరూ నాకు నాయకులు కాదు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అడుగుతున్నాను. నన్ను పోటీ చేపించండి. నా ప్రాణం చంద్రబాబు.. నా రక్తంతో కాళ్లు కడిగి ప్రేమ చూపించా. కొడాలి నాని, వంశీ, కేశినేని నాని టైప్ కాదు నేను. నా రక్తం మొత్తం చంద్రబాబే. నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను. ఎవరి మీదకైనా దూకేశక్తి, సైన్యం నాకు ఉంది. పార్టీలో ఉండి విన్నా.. ‌వినిపించనట్టుగా నటించే మూగోళ్లు, చెవిటోళ్లు ఉన్నారు. చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తే ఒక్కడు మాట్లాడరు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా సీబీఎన్ జిందాబాద్ అనే అంటాను. ఇది అభిమానమే.. బ్లాక్ మెయిలింగ్ కాదు. ఇక‌ నా‌ పని తీరు, స్వామి భక్తి ఎలా నిరూపించుకోవాలి. నాకు సీటు ఇచ్చి చట్ట సభల్లో అడుగు పెట్టించాలని కోరుతున్నా. ఇది నా విన్నపం, విజ్ఞప్తి మాత్రమే. నాలో ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు కుటుంబం తోనే నా ప్రయాణం’’ అని బుద్ధా వెంకన్న భావోద్వేగంగా మాట్లాడారు.

Updated Date - Feb 18 , 2024 | 12:20 PM