Share News

AP Assembly Sessions: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు

ABN , Publish Date - Jul 22 , 2024 | 01:24 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.

AP Assembly Sessions: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు
BAC Meeting

అమరాతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికార పక్షం ప్రతిపాదించింది. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హజరయ్యారు.


Untitled-14.jpg

కమిటీ హాల్లో ఎన్డీయే సభాపక్షం

అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన శాసనసభా పక్షం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు అసహనంతో ఉన్నారని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారని పలువురు జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి..

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున అరెస్ట్

For more AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 01:44 PM