Home » AP Assembly Sessions
వైఎస్సార్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సభకు దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు.
ఏపీ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేయనుంది.
ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభలో వైసీపీ సభ్యుల పద్ధతి సరిగా లేదని లోకేష్ చెప్పారు.
వెటర్నరీ అంబులెన్సుల కోనుగోళ్లలో గత వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 14వ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశంపై కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడారు.
విశాఖ లో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేటు విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు-2025ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చామని, అందులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తావతీ మంత్రి లోకేష్ వెల్లడించారు.
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్... ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతే. వైసీపీ నేతలు చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు చేయిస్తాం.
మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.
శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.
Lokesh response YSRCP protests: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు వాళ్లే పెట్టి తిరిగి వాళ్లే ధర్నాలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.
ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.