Share News

Comedian Prudhvi: ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:57 PM

జనసేన కేంద్ర కార్యాలయానికి సినీ నటుడు పృధ్వీ వచ్చారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. పార్టీ కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, నాగబాబులను పృధ్వీ కలిశారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ఫ్యాన్ వేస్తున్నారని.. ఇక ఆపాలలని చెబుతూనే ఉన్నానన్నారు.

Comedian Prudhvi: ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారు

విజయవాడ: జనసేన కేంద్ర కార్యాలయానికి సినీ నటుడు పృధ్వీ వచ్చారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. పార్టీ కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, నాగబాబులను పృధ్వీ కలిశారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ఫ్యాన్ వేస్తున్నారని.. ఇక ఆపాలలని చెబుతూనే ఉన్నానన్నారు. ప్రజలకు కూడా వాస్తవం అర్ధమైందని...‌ చిత్తుగా ఓటుతో చితక్కొట్టారని పృధ్వీ పేర్కొన్నారు. అహంకారం, అధికార మధంతో మాట్లాడిన వారందరికీ ప్రజలే శిక్ష వేశారన్నారు.


తాను అనుకున్నది జరిగినందుకు వెంకన్నకు తల నీలాలు ఇస్తాననని పృధ్వీ తెలిపారు. 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం అని సజ్జల చెప్పారన్నారు. మరి విశాఖలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని అడ్డగోలుగా మాట్లాడారన్నారు. మహిళలు అని కూడా చూడకుండా బండ బూతులు తిట్టి.. ‘ప్రజలు బుద్ధి చెప్పాక నా అక్కలు, నా చెల్లెళ్లు, నా అవ్వలు ఏమయ్యారు’ అని అడుగుతున్నారని పృధ్వీ పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అయినా కనువిప్పు కలగాలన్నారు.

AP Election Result 2024: ఉత్తరాంధ్రలో ఊడ్చేసి.. కోస్తాలో కుమ్మేసి! సీమలో రచ్చచేసి

For more Andhrapradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 01:23 PM