Share News

Vijayasai Reddy: అప్పుడు జగన్ వద్దన్నారని ఆగా.. ఇప్పుడు ఎవ్వరి మాటా వినను..

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:27 PM

చాలా రోజుల తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనపై ఓ మహిళ గర్భం విషయంలో చాలా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన స్పందించలేదు

Vijayasai Reddy: అప్పుడు జగన్ వద్దన్నారని ఆగా.. ఇప్పుడు ఎవ్వరి మాటా వినను..

విశాఖ: చాలా రోజుల తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనపై ఓ మహిళ గర్భం విషయంలో చాలా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన స్పందించలేదు. ఇవాళ స్వయంగా ఆమె వచ్చి విజయసాయితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని గట్టిగా చెప్పారు. ఆ తరువాత కొంత సేపటికే ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బ తీసిన వారెవరైనా.. ఆఖరికి మా పార్టీలో ఉన్న వారైనా వదేలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Vijayasai Reddy: నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీస్తే ఆఖరికి మా పార్టీ వారిని కూడా వదలను..


ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను సొంతంగా చానల్ పెడతానని అన్నానని.. అప్పుడు మనకొక ఛానల్ ఉంది కదా వద్దని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించారన్నారు. దీంతో తాను విరమించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ సారి మాత్రం తగ్గేదే లేదని.. ఛానెల్ తప్పకుండా ప్రారంభిస్తానని.. ఎవరి వద్దని వారించినా స్టార్ట్ చేస్తానని స్పష్టం చేశారు. తను పెట్టే ఛానల్ న్యూట్రల్‌గా ఉంటుందని.. నిజాలు మాత్రమే చెబుతానని విజయసాయి రెడ్డి అన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీదే విజయమన్నారు. తాను భూములు అక్రమిస్తే.. వాటిని తిరిగి తీసుకోవాలని.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు. స్కాలర్షిప్ విషయంలో మదన్ మోహన్ తనను రెండు సార్లు కలిశారన్నారు. వాడికి.. తనకూ ఏ మాత్రం సంబంధం లేదని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Nita Ambani: మీడియాకు క్షమాపణలు తెలిపిన నీతా అంబానీ.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 12:45 PM