Share News

Bus accident: చిలకలూరిపేట బస్సు ప్రమాదం.. ఆ కుటుంబం బాధకు అంతే లేదు..

ABN , Publish Date - May 15 , 2024 | 07:47 AM

చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టిప్పర్ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో తెల్లవారుజామునే ఆరుగురి బతుకులు తెల్లారిపోయాయి.

Bus accident: చిలకలూరిపేట బస్సు ప్రమాదం.. ఆ కుటుంబం బాధకు అంతే లేదు..

గుంటూరు: చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టిప్పర్ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో తెల్లవారుజామునే ఆరుగురి బతుకులు తెల్లారిపోయాయి. చిలకూరిపేట బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఏం జరిగిందో కూడా తెలుసుకోక ముందే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి


అయితే వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65). ఉప్పుగుండూరు లక్ష్మి (55).. ఉప్పుగుండూరు సాయిశ్రీలు మృతి చెందారు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పసుమర్రు బస్సు ప్రమాద బాధితులకు జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన నలుగురు కి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. గుంటూరులో చికిత్స పొందుతున్న వారిలో వెంకట్రావు, సాయి, రాజి, లిప్సిక ఉన్నారు. భావన అనే బాధితురాలిని రమేష్ ఆసుపత్రికి తరలించారు. 15 శాతం కాలిపోయిన భావన అనే యువతిని చికిత్స నిమిత్తం రమేష్ ఆసుపత్రికి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:47 AM