Share News

Tirupati : శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:36 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు గురువారం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirupati : శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

  • స్వల్ప అస్వస్థతతో స్విమ్స్‌లో చేరిన జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

తిరుపతి(వైద్యం)/తిరుమల, జూలై18 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు గురువారం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. కాగా, తిరుమలలో స్వల్ప అస్వస్థతకు గురైన జస్టిస్‌ దుర్గాప్రసాదరావును స్విమ్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆర్‌ఐసీయూలోని ప్రత్యేక వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి సాధారణ అస్వస్థతకు గురయ్యారని, ఎలాంటి ఇబ్బంది లేదని స్విమ్స్‌ వైద్యులు తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 05:36 AM