Share News

Vangaveeti Radha: ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:09 AM

వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామన్నారు.

Vangaveeti Radha: ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామన్నారు.


ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తోందని వంగవీటి రాధా అన్నారు. అందరం కష్టపడి పని చేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని.. బేర సారాల కోసమో.. పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రతి సామాన్యుడుకు న్యాయం జరగాలని రంగా ఆశయమని.. దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధా అన్నారు.

Updated Date - Jul 04 , 2024 | 11:09 AM