ఊపందుకున్న బెల్లం లావాదేవీలు
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:20 AM
స్థానిఇక ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు కొత్త బెల్లం రాక ఊపందుకుంది. సంక్రాంతి పండుగ సమీస్తుండడంతో రైతులు బెల్లం దిమ్మలను యార్డుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. మంగళవారం 13,947 బెల్లం దిమ్మలు వచ్చాయి.
ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు 13,947 దిమ్మలు రాక
ప్రస్తుత సీజన్లో ఇవే అత్యధికం
అనకాపల్లి టౌన్, జనవరి 2: స్థానిఇక ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు కొత్త బెల్లం రాక ఊపందుకుంది. సంక్రాంతి పండుగ సమీస్తుండడంతో రైతులు బెల్లం దిమ్మలను యార్డుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. మంగళవారం 13,947 బెల్లం దిమ్మలు వచ్చాయి. అత్యధిక బెల్లం దిమ్మలు రావడం ప్రస్తుత సీజన్లో ఇదే ప్రథమం అని వ్యాపారులు వెల్లడించారు. ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో మంగళవారం అధిక సంఖ్యలో బెల్లం దిమ్మలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఒకటో రకం వంద కిలోలు రూ.4,500, రెండో రకం రూ.4,250, మూడో రకం రూ.3,730 ధరలు పలికాయి.