చంద్రబాబు రోడ్షో రేపు
ABN , Publish Date - May 08 , 2024 | 01:41 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల తొమ్మిదో తేదీ సాయంత్రం నగరంలోని దక్షిణ, ఉత్తర నియోజక వర్గాల్లో రోడ్షో నిర్వహిస్తారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు.
జగదాంబ జంక్షన్ నుంచి పూర్ణామార్కెట్, డాబాగార్డెన్స్ మీదుగా సీతంపేట వరకూ...
అక్కడ రాత్రి 7.30 గంటలకు సభ
సీతంపేటలో బహిరంగ సభ
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల తొమ్మిదో తేదీ సాయంత్రం నగరంలోని దక్షిణ, ఉత్తర నియోజక వర్గాల్లో రోడ్షో నిర్వహిస్తారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు జగదాంబ జంక్షన్లో రోడ్షో మొదలవుతుందని, అక్కడ నుంచి పూర్ణామార్కెట్, దుర్గాలమ్మ గుడి జంక్షన్, సరస్వతి పార్కు, డాబాగార్డెన్స్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా సీతంపేట వరకు కొనసాగుతుందన్నారు. సీతంపేటలో రాత్రి 7.30 గంటలకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారన్నారు. కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు రోడ్ షోను, సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.