సీఎం జగన్ రాక రేపు
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:17 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల ఐదోతేదీన నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల ఐదోతేదీన నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.45కు రుషికొండలోని ఐటీ హిల్ నంబరు -3లో ఉన్న హెలీప్యాడ్కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజన్ వైజాగ్ లోగో ఆవిష్కరణ, పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ హాల్కు 12.45 గంటలకు చేరుకుని, ‘కేస్కడింగ్ స్కిల్స్-పేరిడియం భగవత’ సదస్సును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి రుషికొండ హిల్ నంబరు-3కి చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్టుకు చేరుతారు. 2.30 గంటలకు విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.