Share News

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:42 AM

మండలంలోని కొత్తవలస- కిరండూల్‌ రైల్వేలైన్‌ చీమిడిపల్లి రైల్వేస్టేషన్‌ యార్డులో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
చీమిడిపల్లి స్టేషన్‌యార్డులో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

యథావిధిగా రైళ్ల రాకపోకలు

అనంతగిరి, అక్టోబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తవలస- కిరండూల్‌ రైల్వేలైన్‌ చీమిడిపల్లి రైల్వేస్టేషన్‌ యార్డులో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి కిరండూల్‌ వెళుతున్న ఈ రైలు చీమిడిపల్లి రైల్వేస్టేషన్‌ యార్డులోకి వచ్చేసరికి నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి కేకే లైన్‌లో యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగాయి.

Updated Date - Oct 22 , 2024 | 12:42 AM