అరకులోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Mar 09 , 2024 | 01:29 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నలుగురి మృతి
మరో ఐదుగురికి తీవ్రగాయాలు
అరకులోయ, మార్చి 8: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా అరకులోయ-లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. మూడు బైక్లపై ఉన్న వారిలో నలుగురు మృతిచెందారు. వీరిలో ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. బైక్లు ఢీకొనడంతో చుట్టుపక్కల ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని అరకులోయ ఆస్పత్రికి తరలించారు.