Share News

సింహాద్రి ఎన్‌టీపీసీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:47 PM

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో రూ.30 కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సింహాద్రి ఎన్‌టీపీసీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు
మోదీ ప్రసంగాన్ని తిలకిస్తున్న సింహాద్రి ఎన్టీపీసీ అధికారులు

నిర్మాణానికి ఆదిలాబాద్‌ నుంచి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన

పరవాడ, మార్చి 4: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో రూ.30 కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సింహాద్రికి చెందిన దీపాంజలి నగర్‌లో గల శకుంతల ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన స్ర్కీన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని సింహాద్రి సీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా, ఇతర అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:47 PM