స్పందన అర్జీలపై సత్వరమే స్పందించండి
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:08 AM
స్పందనలో ప్రజలు అందజేసే అర్జీలపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ రవిపట్టన్శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జేసీ, డీఆర్వోలతో కలిసి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అధికారులకు కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జనవరి 29: స్పందనలో ప్రజలు అందజేసే అర్జీలపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ రవిపట్టన్శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జేసీ, డీఆర్వోలతో కలిసి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి పల సమస్యలపై 494 అర్జీలు అందజేశారు. అనంతరం వీటిని సంబంధిత శాఖల అధికారులకు బదలాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందనలో వచ్చే అర్జీలు ప్రధానంగా భూసమస్యలు, రేషన్కార్డులపై అధికంగా వుంటున్నాయని, సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి దృష్టి సారించాలని ఆదేశించారు.