రెండో రోజు పాలీసెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - May 29 , 2024 | 12:03 AM
మండలంలోని రేబాకలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రెండో రోజు పాలీసెట్ కౌన్సెలింగ్ను ప్రిన్సిపాల్ ఐవీఎస్ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహించారు.
అనకాపల్లి రూరల్, మే 28 : మండలంలోని రేబాకలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రెండో రోజు పాలీసెట్ కౌన్సెలింగ్ను ప్రిన్సిపాల్ ఐవీఎస్ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహించారు. మంగళవారం 1201వ ర్యాంకు నుంచి 27 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగిందన్నారు. 157 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఐసీఆర్ పత్రాలను అందజేశారు. ఇందులో 94 మంది బాలురు ఉండగా.. 63 మంది బాలికలు కౌన్సెలింగ్కు హాజరయ్యారన్నారు. బుధవారం 2701 నుంచి 43వేల ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని ఆయన వెల్లడించారు.