Share News

ఓటర్లకు వలంటీర్ల ఫోన్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:48 AM

వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పినా విశాఖపట్నంలో వైసీపీ నాయకులు వదలడం లేదు.

ఓటర్లకు వలంటీర్ల ఫోన్లు

బయోమెట్రిక్‌ వేస్తే...వైసీపీ నేతలు రెండు రోజుల్లో డబ్బులు వేస్తారట

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి):

వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పినా విశాఖపట్నంలో వైసీపీ నాయకులు వదలడం లేదు. వారితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలోని ఒక నియోజకవర్గంలో ఓటర్లకు వలంటీర్లు ఫోన్లు చేసి, ఓటరు గుర్తింపు కార్డులు తీసుకుని ఫలానా చోటకు రావాలని కోరుతున్నారు. శని, ఆదివారాల్లో వస్తే...బయోమెట్రిక్‌ తీసుకుంటామని, ఆ తరువాత మీ ఖాతాలో వైసీపీ నాయకులు డబ్బులు వేస్తారని వారు చెబుతున్నారు. ఈ విషయం కొంతమంది ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పారు.

Updated Date - Apr 27 , 2024 | 01:48 AM