Share News

ఖైదీలకు అన్ని వసతులు కల్పించాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:06 AM

సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు అన్ని వసతులు కల్పించాలని జిల్లా జైళ్లశాఖ అధికా రి కె.మోహన్‌రావు సూచించారు.

ఖైదీలకు అన్ని వసతులు కల్పించాలి

పాలకొండ: సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు అన్ని వసతులు కల్పించాలని జిల్లా జైళ్లశాఖ అధికా రి కె.మోహన్‌రావు సూచించారు. సబ్‌జైలును ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడి, వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. జైలు సూపరింటెండెంట్‌ బి.జోగులుతో మాట్లాడుతూ రిమాండ్‌ ఖైదీలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారికి అందిస్తున్న ఆహారంతో పాటు తాగునీరు వేడిగా ఉండాలని సూచించారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు వారం వారం నిర్వహించారు. అనంతరం జైలు పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు హెడ్‌ వార్డర్స్‌ పి.చంద్రరావు, బి.విజయ్‌కుమార్‌, పి.మధు, వార్డర్స్‌ నరసింహ, లీగల్‌ కో-ఆర్డినేటర్‌ ఎంవీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:06 AM