రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:18 AM
చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓకా పూరి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి, గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే ఎస్సై సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
చీపురుపల్లి, జనవరి 2: చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓకా పూరి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి, గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే ఎస్సై సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మృతుని వ్యక్తిగత వివరాలు తెలియరాలేదన్నారు. ఒడిశాలోని గంజాం ప్రాంతానికి చెంది, సూరత్లో పని చేస్తున్నట్టు గుర్తించా మన్నారు. సోమవారం సూరత్ నుంచి ఒడిశా వెళ్తుండగా, ప్రమాద వశాత్తూ కాలు జారి పడి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. మృతుని ఒంటిపై నీలి రంగు డ్రా యర్ మాత్రమే ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్సై తెలి పారు. వివరాలు తెలిసిన వారు 70132 73731 నంబరుకు సమాచారం అందించాలని ఆయన కోరారు.