బైకు బోల్తా.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:59 PM
మండలంలోని ఎల్విన్పేట-కేదారిపురం ప్రధాన రహదారి లో పీటీజీ గురుకుల బాలికల పాఠశాల దిగువన బైకు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులను తీవ్ర గాయాలయ్యాయి.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట-కేదారిపురం ప్రధాన రహదారి లో పీటీజీ గురుకుల బాలికల పాఠశాల దిగువన బైకు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులను తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మల క్ష్మీపురం గ్రామం కొండ వీధికి చెందిన బి.వెంకటరావు, తన సోదరుడు సురేష్తో పని నిమిత్తం బైకుపై జేకేపాడు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసు కుంది. వెంకటరావుకు కాలు విరగ్గా, సురేష్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రు లను గుమ్మలక్ష్మీపురం సీహెచ్సీకి తీసుకుని వెళ్లి, చికిత్స అందిస్తున్నారు.