Share News

వసంతలో పశువుల శాల దగ్ధం

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:34 AM

మండలంలోని వసంత గ్రామంలో చలుమూరి అప్పారావుకు చెందిన పశువుల శాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

వసంతలో పశువుల శాల దగ్ధం

గంట్యాడ: మండలంలోని వసంత గ్రామంలో చలుమూరి అప్పారావుకు చెందిన పశువుల శాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి రోజులా అప్పారావు మంగళవారం రాత్రి పశువులను శాల బయట కట్టి గడ్డి వేసి ఇంటికి వచ్చారు. తిరిగి బుధవారం ఉదయం అప్పారావు కళ్లం వద్దకు వెళ్లే సరికి పశువుల శాల కాలి బూడిదై ఉంది. బయట కట్టిన ఆవుల్లో ఒకదాన్ని శాలలో కట్టి నిప్పు పెట్టారు. అయితే ఆవుకు కట్టిన కర్ర విరిగిపోవడంతో మంటల్లో నుంచి బయట రావడంతో ఆవుకు ప్రమాదం తప్పింది. గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ కేసు నమోదు చేశారు. వెంటనే ఘటనా స్థలాన్ని డాగ్‌ స్కాడ్‌, క్లూస్‌టీంతో పరిశీలించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు కొండపల్లి కొండలరావు, మండల టీడీపీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్‌ నాయుడు, టీడీపీ నాయకులు జి.శ్రీనివాసరావు

Updated Date - Sep 19 , 2024 | 12:34 AM