మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:55 PM
జిల్లా కేంద్రం పార్వతీపురంలో చేపడుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇంజినీరింగ్ అధికారు లను ఆదేశించారు.
బెలగాం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో చేపడుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇంజినీరింగ్ అధికారు లను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య సదుపా యాలు అందుతాయని, వేరే జిల్లాలకు రిఫర్ చేయాల్సి అవసరం ఉండదని అన్నారు.