Share News

ఇసుక తరలింపుపై వివాదం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:06 AM

మండలంలోని సంతగౌరమ్మపేట వద్ద శుక్రవారం రాత్రి ఇసుక తరలింపుపై వివాదంనెలకొంది. మూడు ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుకను ఎస్‌.కోట, సీతమ్మ పేట గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకున్నారు.

  ఇసుక తరలింపుపై వివాదం

శృంగవరపు కోట రూరల్‌: మండలంలోని సంతగౌరమ్మపేట వద్ద శుక్రవారం రాత్రి ఇసుక తరలింపుపై వివాదంనెలకొంది. మూడు ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుకను ఎస్‌.కోట, సీతమ్మ పేట గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు వేగం పెంచి, బెదిరించి వెళ్లిపోయారు. వేపాడ మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టరు పట్టుబడింది. పోలీసులకు ఎస్‌.కోట, సీతమ్మపేట గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ నారాయణమూర్తి చేసుకుని ట్రాక్టరును ఎస్‌.కోట పోలీసుస్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ తాము నాటు బండ్లతో ఇసుక తీసుకువస్తుంటే మామాడిపల్లి, దేవులాపల్లి గ్రామాలకు చెందిన కొందరు అడ్డుకుంటున్నారని, వారే ఇక్కడ ఇసుకను ట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు.దీంతో తాము అడ్డుకున్నట్లు చెప్పారు.

Updated Date - Sep 21 , 2024 | 12:06 AM