వైసీపీకి ఓటమి తప్పదు
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:07 AM
గుణుపూరుపేటలో కూటమి అభ్యర్థి లోకం మాధవి మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు.
డెంకాడ: గుణుపూరుపేటలో కూటమి అభ్యర్థి లోకం మాధవి మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ వైసీపీకి ఓటమి తప్పదన్నారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్రావు ఉన్నారు. మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, విజయనగరం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాణిరాజు, చిరంజీవిరాజు, జనసేన నాయకులు చింతపల్లి రామ్మూర్తి, తుమ్మి లక్ష్మీరాజ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.