Share News

కెంగువలో నలుగురికి డయేరియా

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:25 AM

మండలంలోని కెంగువ గ్రామంలో నాలుగు డయేరియా కేసులు నమోదైనట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సా యికృష్ణ తెలిపారు.

కెంగువలో నలుగురికి డయేరియా

గజపతినగరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కెంగువ గ్రామంలో నాలుగు డయేరియా కేసులు నమోదైనట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సా యికృష్ణ తెలిపారు. సోమవారం గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. గ్రా మానికి చెందిన సుంకరి సింహాచలం, మండల సూరమ్మ, పెనుమజ్జి సత్యం డయేరియా బారినపడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శనపతి బంగారునాయుడు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్బందులకు గురవు తున్న వ్యాధిగ్రస్థులను వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూయస్‌ అధికారులు డీఈఈ తిరుపతిరావు, జేఈ శ్రీనివాసరావు వాటర్‌ ట్యాంక్‌నుంచి గ్రామానికి సరఫరా జరిగే తాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నీటి నమునాలను తీసి పరీక్షా కేంద్రాలకు పంపిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 12:25 AM