కిడ్నాప్ కేసుపై డీఎస్పీ విచారణ
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:56 PM
బాలికను అపహరించిన కేసులో నిందితుడు రాయపురెడ్డి సురేష్ను, కుటుంబ సభ్యులను విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు శుక్ర వారం విచారించారు.
భోగాపురం: బాలికను అపహరించిన కేసులో నిందితుడు రాయపురెడ్డి సురేష్ను, కుటుంబ సభ్యులను విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు శుక్ర వారం విచారించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ముంజేరుకు చెందిన ఆర్.సురేష్ రెండు నెలల కిందట ఓ బాలికను అపహరించుకుపోయాడు. దీనిపై అప్పట్లో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హైద రాబాద్లో ఉన్నట్లు సమాచారం రావడంతో మూడు రోజుల క్రితం పోలీసులు అక్కడికి వెళ్లి బాలికను, సురేష్ను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసు కొచ్చారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎ.రవికుమార్ పాల్గొన్నారు.