Share News

చెత్తను తక్షణమే తరలించాలి

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:59 PM

నగర పంచాయతీ కార్యాల యం ఎదుట ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

చెత్తను తక్షణమే తరలించాలి

పాలకొండ: నగర పంచాయతీ కార్యాల యం ఎదుట ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు గురువారం నగర పంచాయతీ కార్యాల యంలో ఆందోళన చేశాయి. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ వి.ఇందిర మాట్లాడుతూ.. పాలకొండ పట్టణంలో సేకరించిన చెత్తను నగర పంచాయతీ కార్యాలయం ఎదుట వేయడం తగదన్నారు. ఎస్‌ఐ ప్రయో గమూర్తి తన సిబ్బందితో నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని, అంతవరకు అక్కడ చెత్త వేయకుండా చూస్తామని హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కాద రాము, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పాలకొండ కమిటీ కార్యదర్శి సీహెచ్‌ సంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:59 PM