Share News

మీకు పెట్టుబడి పెట్టి నేను నష్టపోయా

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:11 AM

‘మిమ్మల్ని నమ్ముకుని ఉపాధ్యాయ వృత్తి వదిలేసి నేను సంపాదించిన డబ్బుతో మీకు పెట్టుబడి పెట్టి నేను పూర్తిగా నష్టపోయాన’ని ఎంపీపీ బొంగు సురేష్‌.. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్‌ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మీకు పెట్టుబడి పెట్టి నేను నష్టపోయా

జియ్యమ్మవలస: ‘మిమ్మల్ని నమ్ముకుని ఉపాధ్యాయ వృత్తి వదిలేసి నేను సంపాదించిన డబ్బుతో మీకు పెట్టుబడి పెట్టి నేను పూర్తిగా నష్టపోయాన’ని ఎంపీపీ బొంగు సురేష్‌.. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్‌ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. శత్రుచర్ల వంశాన్ని నాశనం చేసిన వ్యక్తి పరీక్షిత్‌ రాజున్నారు. 2014, 2019లో ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారో తనకు తెలుసన్నారు. మజీ ఎమ్మెల్యే జనార్ధన్‌ ఽథాట్రాజ్‌ అకాల మరణంతో పుష్ప శ్రీవాణి అహంకారం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.

Updated Date - Apr 20 , 2024 | 12:11 AM