కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ABN , Publish Date - Aug 22 , 2024 | 12:26 AM
మండలంలోని ముషిడిపల్లి పంచాయతీలోని గురుకుల పాఠశాల, కళాశాలలకు దీర్ఘకాలికంగా వేధిస్తున్న దీర్ఘకాలిక విద్యుత్స మస్యకు మండల విద్యుత్శాఖ ఏఈ రుద్రరవికుమార్ పూర్తిస్దాయిలో పరిష్కరించారు.
శృంగవరపుకోట రూరల్: మండలంలోని ముషిడిపల్లి పంచాయతీలోని గురుకుల పాఠశాల, కళాశాలలకు దీర్ఘకాలికంగా వేధిస్తున్న దీర్ఘకాలిక విద్యుత్స మస్యకు మండల విద్యుత్శాఖ ఏఈ రుద్రరవికుమార్ పూర్తిస్దాయిలో పరిష్కరించారు. రెండురోజుల క్రితం ఈ పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ట్రాన్స్పార్మర్ పాడవ డంతో ఇందులో ఉన్న వందలాదిమంది విద్యార్థులకు భోజనాలు ఆలస్యంగా పెట్ట డంతో పాటు వారు చదువుకోవడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో మండలంలో ఉన్న విద్యుత్శాఖ సిబ్బందిని తీసుకెళ్లి కాలిపోయిన ట్రాన్స్పార్మర్ను తొలగించి హూటాహూటీన కొత్తట్రాన్స్పార్మర్ తెప్పించి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. పాఠశాల, కళా శాల ప్రిన్సిపాల్స్ సహకారంతో ఈప్రాంతంలో ఉన్న తుప్పలు, డొంకలు, విద్యుత్వైర్లకు అనుకుని ఉన్న చెట్లు తీయించారు. దీంతో ఈ సమస్యకు చెక్పడినట్లయింది.