టీడీపీలో చేరిక
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:24 AM
కురుపాంలో వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు.
కురుపాం: కురుపాంలో వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం కురుపాం కోటలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. టీడీపీలో చేరినవారిలో వైసీపీ సీనియర్ కార్యకర్త మంతిన త్రిపురనాథ్, వార్డు మెంబర్ గెంబలి నాగరాజు, గోళ్లవలసకు చెందిన శెట్టి శ్రీనివాసరావు, కిచ్చాడ కు చెందిన సందీప్, వైసీపీ యువ కార్యకర్త సిల్ల సంతోష్కుమార్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్కుమార్, టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, పాడి సుధ, పార్టీ నాయకుడు చందక రామకృష్ణ పాల్గొన్నారు.