టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:18 AM
టీడీపీ ప్రభుత్వ కాలంలోనే బీసీలకు అన్నింటా న్యాయం జరిగిందని పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: టీడీపీ ప్రభుత్వ కాలంలోనే బీసీలకు అన్నింటా న్యాయం జరిగిందని పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద జయహో బీసీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయచం ద్ర మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఆదరణ పథకంతో కుల వృత్తుల వారికి అండదండగా చంద్రబాబు నాయుడు ఉండేవారన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, అరకు పార్లమెంట్ టీడీపీ బీసీ విభాగం ప్రతినిధి రవి, నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బార్నాల సీతారాం, జి.రవికుమార్, మజ్జి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.