Share News

కమనీయం.. తెప్పోత్సవం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:09 AM

పైడిమాంబ తెప్పోత్సవం కనులవిందుగా సాగింది. సిరిమానోత్సవాల్లో భాగంగా ఏటా సిరిమాను ఊరేగింపు జరిగిన మరుసటి మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

కమనీయం.. తెప్పోత్సవం
పెద్దచెరువులో విద్యుత్‌ దీపాలతో అలంకరించిన పడవపై అమ్మవారి తెప్సోత్సవం

కమనీయం.. తెప్పోత్సవం

పైడిమాంబను కనులారా వీక్షించిన భక్తులు

పైడిమాంబ తెప్పోత్సవం కనులవిందుగా సాగింది. సిరిమానోత్సవాల్లో భాగంగా ఏటా సిరిమాను ఊరేగింపు జరిగిన మరుసటి మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా తెప్పోత్సవం తంతు వైభవంగా జరిగింది. తొలుత పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో వనంగుడి నుంచి ఊరేగింపుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతానికి తీసుకొచ్చారు. నిర్దేశించిన సమయానికి అమ్మవారిని విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తెప్పపై ఆశీనులు చేశారు. అనంతరం మూడు పర్యాయాలు పెద్ద చెరువులో పైడిమాంబ విహరించారు. ఆ సమయంలో పెద్ద చెరువు చుట్టూ వున్న భక్తులు జై జై పైడిమాంబ అంటూ నామస్మరణ చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 12:09 AM