కొటారుబిల్లిలో కనకదుర్గమ్మ తీర్థ మహోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:48 PM
eee
గంట్యాడ: కొటారుబిల్లిలో కనకదుర్గమ్మ తీర్ధ మహోత్సవం బుధవారం సంద డిగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మధ్యా హ్నం ముడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ భక్తులు చీరెలు, కోళ్లతో మొక్కు లు చెల్లించుకున్నారు. ఏటా కనుమ మరుసటిరోజున కనక దుర్గమ్మ తీర్ధ మహోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారిని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ ఇందు కూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టరు కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీని వాసులునాయుడు, జడ్పీటీసీ వర్రినర్సింహమూర్తి, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలు నాయుడు,ఎస్సీ సెల్ చైర్మన్ పీరుబండి జైహింద్ కుమార్తోపాటు వైసీపీ, టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గంట్యాడ ఎస్ఐ సుదర్శననాయుడు, విజయనగరం రూరల్ ఎస్ఐ వాసుదేవరావు అధ్వ ర్యంలోని బందోబస్తు నిర్వహించారు.