Share News

ఆడలి వ్యూపాయింట్‌ను మరింత అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:07 AM

సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలోని ఆడలి వ్యూపాయింట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమా ర్‌ రెడ్డి అన్నారు.

ఆడలి వ్యూపాయింట్‌ను మరింత అభివృద్ధి చేస్తాం

సీతంపేట రూరల్‌: సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలోని ఆడలి వ్యూపాయింట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమా ర్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆడలి వ్యూపాయింట్‌లో చేపడుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతా మని చెప్పారు. పరిశీలనలో పీవోతో పాటు టీడబ్ల్యూ ఈఈ కృష్ణకుమార్‌, పీహెచ్‌వో వెంకటగణేష్‌, ఏఈ నాగభూషణం ఉన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:07 AM