పనివేళలో వెలుగు కార్యాలయానికి తాళం
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:20 AM
మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యాలయానికి మంగళవారం తాళం వేసి, సిబ్బంది మొత్తం బయటకు వెళ్లారు.
గరుగుబిల్లి: మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యాలయానికి మంగళవారం తాళం వేసి, సిబ్బంది మొత్తం బయటకు వెళ్లారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్తే కనీసం ఒకరిద్దరైనా కార్యాలయంలో ఉండాల్సి ఉంది. కానీ మంగళవారం మొత్త సిబ్బంది బయటకు వెళ్లడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది పనితీరు కూడా బాలేదని ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు చేపడతాం
గరుగుబిల్లి వెలుగు సిబ్బంది పనితీరుపై దర్యాప్తు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. పనివేళల్లో తాళాలు వేయడం నా దృష్టికి రాలేదు. దీనిపై దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతాం.
- వై.సత్యంనాయుడు, జిల్లా ఇన్చార్జి, గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ