Share News

మిస్సింగ్‌ కేసులపై అలసత్వం వద్దు: ఎస్పీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:08 AM

:జిల్లాలో వివిద పోలీస్‌స్టేషన్లలో గంజాయి కేసుల్లో ప్రధా న సూత్రదారులను అరెస్ట్‌చేయాలని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ ఆదేశించారు. వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదై దర్యాప్తుల్లో ఉన్న కేసులను మిస్సింగ్‌, సైబర్‌ కేసులను జూమ్‌ కాన్ఫరెన్స్‌లో సమీక్షించి చేపట్టాల్సి చర్యలు గురించి దిశా నిర్ధేశం చేశారు.

మిస్సింగ్‌ కేసులపై అలసత్వం వద్దు: ఎస్పీ

విజయనగరం క్రైం:జిల్లాలో వివిద పోలీస్‌స్టేషన్లలో గంజాయి కేసుల్లో ప్రధా న సూత్రదారులను అరెస్ట్‌చేయాలని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ ఆదేశించారు. వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదై దర్యాప్తుల్లో ఉన్న కేసులను మిస్సింగ్‌, సైబర్‌ కేసులను జూమ్‌ కాన్ఫరెన్స్‌లో సమీక్షించి చేపట్టాల్సి చర్యలు గురించి దిశా నిర్ధేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు పూర్తయిన గంజాయి కేసుల్లో దాఖలుచేసిన కేసుల్లో సంబందిత న్యాయస్థానం నుంచి సీసీ నెంబర్లు పొందా లన్నారు. మిస్సింగ్‌కేసులపై అలసత్వం వద్దని తెలిపారు. కేసు నమోదైన వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని చెప్పారు.కాన్ఫరెన్స్‌లో డీఎస్పీలు గోవిందరావు, వీరకుమార్‌, శ్రీనివాసరావుతో పాటు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:08 AM