ఐదేళ్లలో అభివృద్ధి జాడే లేదు: జయకృష్ణ
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:02 AM
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదం లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.
సీతంపేట: గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదం లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. మండలంలోని దేవనాపురం, వేంపల గూడ, రేగులగూడ, పాత ఈతమానుగూడ, కొత్తగూడ, ఇప్పగూడ, ముకుందాపురం, కల్లంగూడ, ఆనపకాయలగూడ, పులిపుట్టి గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి, గెలిపించాల ని కోరారు. కూటమి నాయకులు సవరతోట ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.
జనసేనలో చేరిక
వీరఘట్టం: చిట్టిపుడివలస సర్పంచ్ కుంబిడి పాపమ్మ, ఎంపీటీసీ విశాలాక్షి, పది మంది వార్డు మెంబర్లతో పాటు పలు కుటుంబాలు శుక్రవారం జనసేన పార్టీలో చేరాయి. వీరికి కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ చేరికల్లో ఉదయాన ఉదయ్భాస్కర్, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, బల్లా హరిబాబు, అనీల్బాబు తదితరులు ఉన్నారు.