చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:57 PM
డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
భోగాపురం: డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు. పైడిశెట్టి నాతవలస టోల్గేట్ వద్ద పని చేస్తున్నాడు. గురువారం మోదవలస నుంచి టోల్గేట్కు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం నుంచి వస్తున్నాడు. సుందరపేట సమీప ఎత్తు బిడ్జి దగ్గర ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో పైడిశెట్టికి బలమైన గాయా లయ్యాయి. విజయనగరం ప్రేవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.