విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీయాలి
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:00 AM
విద్యార్థుల్లోగల నైపుణ్యా న్ని వెలికితీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ అన్నారు.
గజపతినగరం: విద్యార్థుల్లోగల నైపుణ్యా న్ని వెలికితీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ అన్నారు. జిన్నాం గ్రామంలోగల ఉన్నత పాఠశాలలో ఐదో రోజు జరుగుతున్న సాంకేతిక నైపుణ్యాల దినోత్సవాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈసందర్భం గా ఆయన.. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలో సూచించారు. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో ముందంజలో ఉండే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవా లని సూచించారు. విద్యార్థుల్లో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం త్రినాథరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.