వైసీపీ పతనం మొదలైపోయింది
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:59 PM
శృంగవరపుకోట రూరల్: అధికార వైసీపీ పతనం మొద లైందని, కొద్దినెలల్లో ఐదు కోట్ల అంధ్రులు జగన్ను తరమికొట్టబో తున్నారని టీడీపీ రాష్ట్రకార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని సంతగైరమ్మ పేట గ్రామంలో టీడీపీ విశాఖపార్ల మెంటరీ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హించారు.
శృంగవరపుకోట రూరల్: అధికార వైసీపీ పతనం మొద లైందని, కొద్దినెలల్లో ఐదు కోట్ల అంధ్రులు జగన్ను తరమికొట్టబో తున్నారని టీడీపీ రాష్ట్రకార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని సంతగైరమ్మ పేట గ్రామంలో టీడీపీ విశాఖపార్ల మెంటరీ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అంటూ ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ పేరుతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుని ఇప్పుడు కేవలం ఆరువేల పోస్టుల కు డీఎస్సీ నిర్వహించడం దారుణమన్నారు. జుత్తాడ రామసత్యం, పైనాన్స్ వెంకట రావు, ఇందుకూరి శ్రీనురాజు, గనివాడ సన్యాసినాయుడు తదితరులు ఉన్నారు.
విజయనగరం రూరల్: రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రజావ్యతిరేక పాలన జరుగుతుందని, ఈ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని 30 వ డివిజన్ పరిధిలో ధర్మపురిలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని వ్యవస్థలను నాశనం చేసి, ప్రజలకు సుపరిపాలన అందించడానికి వీల్లేకుండా చేశారన్నారు. ఆయా డివిజన్ ఇన్ఛార్జి గేదేల ఆదిబాబు, చందక నాగరాజు, చందక సూరప్పడుతో పాటు తెలుగుయువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.